క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

by Disha Web Desk 6 |
క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా కైకలూరు మండలం వేమవరపాడు గ్రామం హరిజనవాడ క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజులుగా గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చీకటి పడితే చాలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. క్షుద్రపూజలు చేసిన ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే క్షుద్ర పూజలు చేస్తున్న వారిని తమకు అప్పులించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.

Next Story

Most Viewed