- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kurnool: కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం.. ఉద్రిక్తత
కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది..

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం(Kurnool Corporation General Assembly Meeting) రసాభాసగా మారింది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) మధ్య మాటల యుద్ధం నడించింది. ప్రభుత్వ హామీలపై వైసీపీ సభ్యులు నిలదీశారు. తాగునీటి విషయంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ బి.వై.రామయ్య, టీటీపీ సభ్యుడు పరమేష్ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణలు చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్ పెద్దగా అరుస్తూ కుర్చీలు నెలకేసికొట్టారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేవం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వైసీపీ కార్పొరేటర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలేదని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు.






