గ్రానైట్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఏపీ, తమిళనాడు సీఎస్‌లకు చంద్రబాబు లేఖ

by Dishafeatures2 |
గ్రానైట్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఏపీ, తమిళనాడు సీఎస్‌లకు చంద్రబాబు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ గ్రానైట్ తవ్వకాలను అరికట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడులోని కృష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని లేఖలో కోరారు. శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్‌ రాళ్లను రాత్రి వేళల్లో తరలిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలోని నదిమూర్, ఓ.ఎన్ కొత్తూరు, మోట్ల చేను గ్రామాల మీదుగా తమిళనాడుకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందని, రాష్ట్రంలోని రాజకీయ నేతల ప్రమేయంతో ఈ అక్రమ రవాణా జరుగుతోంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.గ్రానైట్ మాఫియా ద్వారా జరుగుతున్న ఈ గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాను తక్షణమే అరికట్టాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలి అని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు సీఎస్‌కు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి : కుహనా మేధావులు ఏడవకండి.. మెగా బ్రదర్ నాగబాబు


Next Story

Most Viewed