వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలకు బిగ్ షాకిచ్చిన చంద్రబాబు..!

by Disha Web Desk 19 |
వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలకు బిగ్ షాకిచ్చిన చంద్రబాబు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితా విడుదల అయ్యింది. మొత్తం 118 మందితో ఫస్ట్ లిస్ట్‌ను రూపొందించారు. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా.. జనసేన తమకు కేటాయించిన 24 సీట్లలో కేవలం ఐదుగురి క్యాండిడేట్ల పేర్లను మాత్రమే అనౌన్స్ చేసింది. మిగిలిన 19 మంది అభ్యర్థుల పేర్లు మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే, వైసీపీ నుండి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురికి చంద్రబాబు షాకిచ్చారు. అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో కేవలం నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాత్రమే చంద్రబాబు సీటు కన్ఫామ్ చేశారు. మిగిలిన ముగ్గురికి ఫస్ట్ లిస్ట్‌లో టికెట్లు ఇవ్వలేదు. ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు చంద్రబాబు తొలి జాబితాలో మొండిచూపారు. మరీ తర్వాత జాబితాల్లోనైనా వీరు టికెట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read More..

టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. తొలి జాబితాలో పవన్‌కు దక్కని చోటు

Next Story

Most Viewed