Breaking: మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన

by Disha Web Desk 16 |
Breaking: మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మైనార్టీ రిజర్వేషన్లపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితితుల్లోనూ మైనార్టీ రిజర్వేషన్లను తొలగించమని హామీ ఇచ్చారు. జగన్ ఐదేళ్ల కాలంలో అరాచకం విచ్చలవిడిగా పెరిగిందని, వైసీపీ నాయకుల వేధింపులతో అబ్దుల్ సలాం బలవన్మరణానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డగా మార్చారని వ్యాఖ్యానించారు. ప్రజలను గొర్రెలని జగన్ అనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని, అందుకే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన త్యాగం చేశాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలను జగన్ తుంగలో తొక్కారని.. ఇప్పుడు మరోసారి మోసం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తమదని చంద్రబాబు వ్యాఖ్యానించారు



Next Story

Most Viewed