బీఫామ్ తీసుకున్న అభ్యర్థులకు కీలక సూచనలు చేసిన చంద్రబాబు

by Disha Web Desk 16 |
బీఫామ్ తీసుకున్న అభ్యర్థులకు కీలక సూచనలు చేసిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. బీఫామ్ తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫాములు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, సంకల్పంతో ముందుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తెలిపారు. కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలని, ఓటు బదిలీ జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజాగళానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని, అదే జగన్ పతనానికి నాంది అని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. కొత్తగా టీడీపీలో చేరిన వారు పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. ఫించన్ కుట్రలు, గులకరాయి డ్రామాలు ప్రజలకు అర్ధమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

Read More..

జగన్ విశాఖ పర్యటనపై టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed