వైసీపీ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించండి: ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్

by Disha Web Desk 21 |
వైసీపీ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించండి: ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై విపులంగా పిటిషన్‌లో రఘురామ వివరించారు.

Read More : కడప- బెంగళూరు రైల్వే లైన్ వద్దంటూ జగన్ లేఖ.. ఆగ్రహం వ్యక్తం చేసిన పురంధేశ్వరి

Next Story

Most Viewed