కారు ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి

by Muthe.Rajitha |

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కారు ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలిసులు తెలిపారు. అంకిరెడ్డిపాలెం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని సూర్యాపేట ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story