ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

by Disha Web Desk 7 |
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : శాసన సభలో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సచివాలయంలోని తన కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులను స్వామి చిత్రపటం వద్ద ఉంచారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషకరమన్నారు. ఆర్థిక లోటు, కొవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామని చెప్పుకొచ్చారు. అదే ఆత్మవిశ్వాసంతో 2023-24 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైనట్లు స్పష్టం చేశారు.

విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు వెల్లడించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేశామని.. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పూజాద కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed