- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులు.. లాఠీలతో చితక్కొట్టిన సీఆర్పీఎఫ్ సిబ్బంది (వీడియో వైరల్)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది.

X
దిశ, వెబ్డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. తెలంగాణలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ముఖ్యంగా ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో తిరుపతిలోని దొడ్డపురంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. అయితే, దొంగ ఓట్లు వేసేందుకు ఇద్దరు యువకులు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనుమానం వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చామని ఒప్పుకున్నారు. అనంతరం యువకులిద్దరిని సీఆర్పీఎఫ్ సిబ్బంది లాఠీలతో చితక్కొట్టారు. అనంతరం వారు ఆ దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లిపోగా వారికి మంచి నీళ్లు తాగించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.
Next Story






