BREAKING: చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. గెలుపు మాదే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్

by Disha Web Desk 1 |
BREAKING: చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. గెలుపు మాదే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. గెలుపు మాత్రం వైసీపీదేనని మంత్రి పెద్ది రామచంద్రా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహించేందుక ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. గెలుపు వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోరే సీఎం జగన్‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆరోపణలు, దూషణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మరోసారి వైసీపీ గెలుపు తథ్యమని అన్నారు.



Next Story

Most Viewed