BREAKING: దస్తగిరి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. సీబీఐ అధికారులను ప్రశ్నించిన ధర్మాసనం

by Disha Web Desk 1 |
BREAKING: దస్తగిరి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. సీబీఐ అధికారులను ప్రశ్నించిన ధర్మాసనం
X

దిశ, వెబ్‌డెస్క్: వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు అవినాష్ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటూ దస్తగిరి తన పిటిషన్‌లో తెలిపాడు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ కోర్టుకు తెలిపాడు. కేసు నుంచి అవినాష్‌ను తప్పిస్తే రూ.20 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి వెల్లడించారు.

ఈ క్రమంలోనే కోర్టు దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించగా. సీబీఐ తరఫు న్యాయవాది సమర్థిస్తున్నామని బదులిచ్చారు. కాగా ఇన్నాళ్లు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు సమాధానంగా తమ కంటే ముందే వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారని సీబీఐ సమాధానమిచ్చింది.

సుప్రీంలో ఆమె పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ వివరణ ఇచ్చింది. దస్తగిరి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు దస్తగిరి పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అదేవిధంగా వైఎస్ భాస్కర్‌రెడ్డి, జి.ఉదయ్ కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 8కు వాయిదా వేసింది.

Read More..

వాహన తనిఖీల్లో..ఏడు లక్షల నగదు సీజ్

Next Story

Most Viewed