BREAKING: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలపై వచ్చిన క్లారిటీ.. ఆ రోజే ఫలితాల విడుదల

by Disha Web Desk 1 |
BREAKING: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలపై వచ్చిన క్లారిటీ.. ఆ రోజే ఫలితాల విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మిడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు 12న ఫలితాను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. జవాబు పత్రాల మూల్యాంకనం, పేపర్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. అయితే, పేపర్ రీ వ్యాల్యుయేషన్ మరో చేస్తున్నారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావొచ్చిందని తెలుస్తోంది. కాగా, ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20 వరకు కొనసాగాయి. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

Next Story

Most Viewed