BREAKING: నామినేషన్ దాఖలు చేసే వేళ టీడీపీలో బిగ్ ట్విస్ట్.. ఆ నియోజకవర్గ అభ్యర్థి మార్పు!

by Disha Web Desk 1 |
BREAKING: నామినేషన్ దాఖలు చేసే వేళ టీడీపీలో బిగ్ ట్విస్ట్.. ఆ నియోజకవర్గ అభ్యర్థి మార్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉండే నేతలంతా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ అభ్యర్థులను ప్రకటించి, వారితో పాటుగా ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్ల విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే మాడుగల నియోజకవర్గ అభ్యర్థి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పెందుర్తి సీటు కావాలంటూ ఏకంగా చంద్రబాబుతో గొడవకు దిగారు. అయితే, పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో బండారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

టికెట్ దక్కని కారణంగా పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. ఇటీవలే విశాఖ పర్యటనలో బండారు సత్యనారాయణను సముదాయించేందుకు చంద్రబాబు ఎంతగానో ట్రై చేశారు. కానీ ఆయన మాత్రం తాను పోటీ చేసేది పక్కా అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ పరిణామంతో టీడీపీ నుంచి మాడుగుల అభ్యర్థిగా బండారును బరిలోకి దింపేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఆ టికెట్‌ను పైలా ప్రసాద్‌కు కేటాయించడంతో ఆయనకు ఏదో ఒక్కటి నచ్చజెప్పి బండారు సత్యనారాయణకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed