BREAKING: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న పరిపూర్ణానంద స్వామి!

by Disha Web Desk 1 |
BREAKING: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న పరిపూర్ణానంద స్వామి!
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ నేత, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ మేరకు ఆయన వెంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. దీంతో, ఆయన టీడీపీలో చేరుతారనే వదంతులు జోరుగా వినిపిస్తున్నాయి. మొదట బీజేపీ నుంచి హిందూపురం ఎంపీ సీటు ఆశించిన పరిపూర్ణానందకు అధిష్టానం షాకిచ్చింది. పార్టీకి కష్టపడి సేవ చేసినప్పటికీ టికెట్‌ దక్కకపోవడంతో హైకమాండ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాగా, స్వామి పరిపూర్ణానంద ముందు హిందూపురం లోక్‌స‌భ లేదా అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రకటించారు. అయితే, హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసినప్పటికీ.. ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. పొత్తుల కారణంగానే తనకు టికెట్ రాకుండా చేశారంటూ పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు. ఇక అసెంబ్లీకి చంద్రబాబు బావమరిది, సినీనటుడు బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగబోతున్నారు.

Next Story

Most Viewed