BREAKING: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుదల

by Disha Web Desk 1 |
BREAKING: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీయట్ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. కాగా, ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

Next Story

Most Viewed