BREAKING: మాజీ మంత్రి సోమిరెడ్డిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం

by Disha Web Desk 1 |
BREAKING: మాజీ మంత్రి సోమిరెడ్డిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వాతావరణం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లా మనుగోలు మండల పరిధిలోని కట్టుపల్లిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సోమిరెడ్డిని అంతమొందించేందుకు అప్పటికే అక్కడ వైసీపీ చెందిన కొందరు కాపు కాశారు. అనంతరం సోమిరెడ్డి సభా వేదికపైకి వస్తుండగానే వైసీపీకి చెందిన నాయకుడు వెంకటయ్య గడ్డపారతో సొమిరెడ్డిని పొడిచేందుకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన సోమిరెడ్డి, అతడి అనుచరులు దాడికి పాల్పడిన వెంకటయ్యను అడ్డుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయితే అక్కడ పోలీసులు అనూహ్యంగా తిరిగి 11 మంది టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story