వియ్యంకులు కాబోతున్న బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి

by Web Desk |
వియ్యంకులు కాబోతున్న బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నేతలు వియ్యంకులు కాబోతున్నారు. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన టీడీపీ నేత, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిలు వియ్యంకులు కాబోతున్నారు. బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్.. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 27న వీరి వివాహ నిశ్చితార్థం జరగనుంది. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగనుంది.

సిద్ధార్థ్, జస్విత అమెరికాలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నారై టీడీపీ విభాగంలో సిద్ధార్థ్, జస్విత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే టీడీపీ లో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు.. నారాయణ వియ్యంకులు గా ఉన్నారు. అదే విధంగా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం గంటాకు వియ్యంకులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు - కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వియ్యంకులు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఏవీ సుబ్బారెడ్డి- బొండా ఉమా కూడా చేరబోతున్నారు.

Next Story

Most Viewed