BREAKING: ఆధిక్యంలో పురంధేశ్వరి

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-04 03:24:04  IST  )

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి ముందజలో కొనసాగుతున్నారు...

BREAKING: ఆధిక్యంలో పురంధేశ్వరి
X

దిశ, వెబ్ డెస్క్: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి ముందజలో కొనసాగుతున్నారు. రాజమండ్రి నుంచి ఆమె ఎంపీగా పోటీ చేశారు. పోస్టల్ బ్యాలెట్‌లో 1973 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా కూటమికి పడ్డాయి. దీంతో ఆ పార్టీల అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కు సంబంధించి ఈ రోజు లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story