Ap News: పురంధేశ్వరిని విమర్శిస్తే సహించం.. సజ్జలకు శివన్నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 16 |
Ap News: పురంధేశ్వరిని విమర్శిస్తే సహించం.. సజ్జలకు శివన్నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జోలికి వస్తే ఊరుకునేదిలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ కోసం పని చేస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పురంధేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి సజ్జలకు లేదని మండిపడ్డారు. మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ కోరగానే వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందన్నారు. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ కక్షలున్నాయని, వాటిని ఆసరాగా చేసుకుని పురంధేశ్వరిపై విమర్శలు చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ నేతలకు లేదని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం ఎక్కడికిపోతోందని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల నిధుల మళ్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తే ఇప్పటివరకూ మంత్రులు స్పందించలేదని ఎద్దేవా చేశారు. తమ నాయకురాలు పురంధేశ్వరిపై అవాకులు, చవాకులు పేలితే సహించమని బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు.

Next Story

Most Viewed