- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:మాజీ మంత్రి అంబటికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

దిశ,వెబ్డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల(జూన్) 18వ తేదీన పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) పోలీసుల ఆంక్షలు ఉల్లఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ ఆరోపణల పై విచారణకు రావాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసులు ఈ రోజు(ఆదివారం) నోటీసులు జారీ చేశారు. గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి రజనీతో పాటు పలువురు జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 118 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు.






