BIG News: వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

by Kema Shiva Kumar |   (  Updated:2024-08-02 08:01:05  IST  )

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

BIG News: వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 సీట్లకే పరిమితమై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీలో నిలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంపై ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పలు మార్లు చర్చలు జరిపిన ఆయన చివరికి విధేయుడైన బొత్సకే టికెట్ ఖరారు చేశారు. అయితే, ఆగస్టు 30న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా.. ఆగస్టు 13 లోపు నామినేషన్ల దాఖలు చేసేందుకు సమయం ఉంది.

Next Story