BIG BREAKING: చంద్రబాబుకు సీఐడీ మరో ఝలక్.. ఆ విషయంలో మరో కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2024-03-12 14:23:40  IST  )

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు సీఐడీ మరో ఝలక్ ఇచ్చింది.

BIG BREAKING: చంద్రబాబుకు సీఐడీ మరో ఝలక్.. ఆ విషయంలో మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు సీఐడీ మరో ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు ఎసైన్డ్‌ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అమరావతిలో ఎసైన్డ్‌ భూముల విషయంలో 2020లో నమోదు చేసిన కేసులో నిందితుడిగా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సీఐడీ పిటిషన్ పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాజధాని అసైన్డ్‌ భూముల కొనుగోళ్లలో చాలా అక్రమాలు జరిగాయంటూ ప్రసాద్‌కుమార్‌ అనే వ్యక్తి 2020 ఫిబ్రవరి 27న ఇచ్చిన ఫిర్యాదుతో పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Read More..

రెండు పార్టీల వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేనా?

Next Story