- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు అలర్ట్..నేడు 12 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు 12 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఓ వైపు ఎండలు దంచి కొడుతూనే, మరోవైపు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు APSDMA ఎండీ ప్రఖర్ జైన్.
ఈ తరుణంలో రైతులు... వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. అటు నేడు ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు(D)మేడికొండూరు, పెదనందిపాడు,ఫిరంగిపురం, ప్రత్తిపాడు,తుళ్లూరు,వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర,మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ప్రఖర్ జైన్ ఉందన్నారు. ఎండ తీవ్రత,ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






