- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APPSC:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆ పరీక్షల తేదీలు ఖరారు
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్డెస్క్: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష(Group 1 Mains Exams)ల కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1 షెడ్యూల్ను APPSC ఖరారు చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు(Exams) జరుగుతాయని ప్రకటించింది. ఈ ఏడాది మే 3న తెలుగు, 4న ఇంగ్లీష్, 5న పేపర్ 1 జనరల్ ఎస్సే, 6న పేపర్2 హిస్టరీ, కల్చరల్, 7న పేపర్ 3 పాలిటీ, లా, 8న పేపర్ 4 ఎకానమీ, 9న పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ ఎగ్జామ్స్ జరుగుతాయని వివరించింది. పరీక్షలన్నీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని పేర్కొంది. ప్రశ్నాపత్రాన్ని ట్యూబుల్లో ఇవ్వనున్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ప్రకటించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు






