- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-2 Mains Exams:గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్(Group-2 Mains) పరీక్ష తేదీలను APPSC కమిషన్ ప్రకటించింది. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానున్న ఈ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ నేడు(అక్టోబర్ 30) ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొత్తం 13 జిల్లాల్లో ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఏపీ డీఎస్సీ(DSC), టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల(Intermediate Exam) తేదీలను దృష్టిలో ఉంచుకొని.. పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్(APPSC Group-2 Mains Exams) తేదీలు నిర్ణయించినట్లు కమిషన్ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ సందర్శించండి.






