గంజాయికి అడ్డాగా ఆంధ్ర.. అక్కడ గంజాయి ముఠాను పట్టుకున్న ప్రముఖ రాజకీయ నేత..!

by Disha Web Desk 3 |
గంజాయికి అడ్డాగా ఆంధ్ర.. అక్కడ గంజాయి  ముఠాను పట్టుకున్న ప్రముఖ రాజకీయ నేత..!
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రానురాను గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఒకప్పుడు ఒర్రిస్సా బాడర్, వైజాగ్ కి పరిమితమైన గంజాయి.. ప్రస్తుతం మెల్లమెల్లగా ఆంధ్ర రాష్ట్రమంతటా వ్యాపిస్తోంది. తాజగా గంజాయి మత్తు ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డకు చేరుకొంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి ఆళ్లగడ్డలోని ఓ పొలంలో పలువురు గంజాయి సేవించారు.

కాగా గంజాయి సేవిస్తున్న బ్యాచ్ ను మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాచ్ ను పట్టుకునేందుకు భూమా అఖిల ప్రియ అనుచరులు ప్రయత్నించారు. అయితే భూమా అఖిల ప్రియ అనుచరులకు దొరకకుండా గంజాయి బ్యాచ్ తపించుకున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన భూమా అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేశారు.

నియోజకవర్గం పరిధిలో విచ్చలవిడిగా గంజాయి వాడకం జరుగుతోందని ఆరోపించారు. అలానే యువత గంజాయి మత్తులో మునిగి తేలుతుంటే పాలక పక్షం, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గంలో హద్దూ అదుపు లేకుండా గంజాయి వాడకం జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు.

Next Story

Most Viewed