- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pv Sindu Marriage: పవన్ కల్యాణ్కు ఆహ్వాన పత్రిక అందజేత
తన పెళ్లికి రావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు ఆహ్వానించారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan)ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(Badminton player PV Sindhu) కలిశారు. మంగళగిరి (Mangalagiri)క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె.. తన మ్యారేజ్కు రావాలని ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 22న తన పెళ్లి ఉదయ్ పూర్(Udaipur)లో జరగబోతోందని, కుటుంబ సమేతంగా అందరూ రావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పీవీ సింధుతో పాటు ఆమె తండ్రి పి.వి. రమణతోనూ పవన్ కల్యాణ్ ముచ్చటించారు.
కాగా పీవీ సింధుకు వివాహం నిశ్చయమైంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయితో ఈ నెల 22న ఆమె పెళ్లి జరగనుంది. రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో ఈ జంట పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఘనంగా చేసుకున్నారు. కాబోయే దంపతులిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 20వ తేదీ నుంచి హైదరాబాద్లో పీవీ సింధు పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 24న విందు కార్యక్రమం ఉంటుందని పీవీ సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు.






