TDP: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన N. Chandrababu Naidu

by Disha Web Desk 4 |
TDP: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన N. Chandrababu Naidu
X

దిశ, ఏపీ బ్యూరో: నేడు రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే ప్రజల్లో భయం పట్టుకుందని, పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఎక్కడ చూసినా విద్వేషమే కనిపిస్తుందని, పాలకుల విజన్ పోయి పాయిజన్‌గా తయారయ్యిందని విమర్శించారు. మంగళగిరిలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని పరిచయం చేసింది, ఆహార భద్రతకు నాంది పలికింది దివంగత ఎన్టీఆర్ అని తెలిపారు. పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది ఆయనేనని కొనియాడారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంతో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. తెలుగుదేశం జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు. టీడీపీ గత విజయాలు ప్రజలకు గుర్తు చెయ్యాలి నేలకు సూచించారు. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం అవసరం చాటి చెప్పింది టీడీపీనేనని స్పష్టం చేశారు.

తమకు రావాల్సిన బకాయిలపై ప్రశ్నిస్తే కేసులా?

తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్లకార్డు పట్టుకున్నాడని, ఆయనను టార్గెట్ చేస్తూ ఉద్యోగం నుంచి తొలగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ తనను వేధించలేదని చెప్పిన శ్రీలక్ష్మిని సైతం వేధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలను ప్రస్తావిస్తే దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తాము విజన్‌తో చేసిన పాలనతో ఇప్పుడు హైదరాబాద్ మంచి స్థానంలో ఉందని గుర్తుచేశారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నత స్థితిలో ఉండడమే తనకు సంతృప్తినిస్తుందని 27 ఏళ్ల క్రితం తమ పార్టీ చేసిన పనులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. విభజన వల్ల నష్టం జరిగినా.. తమ పాలనలో సంక్షేమాలు అందించామని తెలిపారు. 200 పెన్షన్ 2000 చేశామని, ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. నేడు జగన్ పాలనలో ఒక్కో కుటుంబంపై మూడేళ్లలో 3.25 లక్షల రుణ భారం మోపారని మండిపడ్డారు. దేశంలో ఎక్కువ పెట్రో ధరలు ఉండే రాష్ట్రం ఏపీనేనని వృత్తి పన్ను, ఆస్థిపన్ను, చెత్త పన్ను అని ఇష్టం వచ్చినట్లు పన్నులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పెట్టిన అన్న క్యాంటీన్ రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు అన్నదానం చేస్తున్న వారిపైనా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో డొక్కా సీతమ్మ అన్నదానం చేశారని, అన్నదానానికి ఆమె స్ఫూర్తి అని కొనియాడారు. నందిగామలో చివరికి కోర్టుకు వెళ్లి అన్న క్యాంటీన్ నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నామని తెలిపారు

ప్రభుత్వం చేతగాని తనంతోనే ఆత్మహత్యలు

రాష్ట్రంలో అటు పన్నుల భారం.. ఇటు అప్పుల భారంతో ఎస్సీలకు ఉన్న 26 పథకాలు రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. చింతూరులో వరదల సమయంలో సీఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూ వచ్చి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సీఎం ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. వరద ప్రాంతంలో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పేదలకు విదేశీ విద్యను దూరం చేశారని మండిపడ్డారు. బీసీలకు ఒక్క పథకం లేదని, కాపు కార్పొరేషన్‌కు నిధులు లేదని తెలిపారు. రాష్ట్రంలో రైతులు కూడా సంతోషంగా లేరని చెప్పారు. కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు అంతా రోడ్డున పడ్డారని. చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నారని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ పాలనలోనే దళితులు, గిరిజనులపై దాడులు..

పక్క రాష్ట్రం నుంచి మద్యం, గంజాయి తెచ్చేవారికి నో చెక్ పోస్ట్ పెట్టి సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం చెక్ పోస్ట్‌లు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతిని పూర్తి చేస్తామని మద్య పాన నిషేదం చేస్తేనే ఓటు అడుగుతామని చెప్పి నేడు వాటిపైనే అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై 31 శాతం దాడులు జరిగాయని ఈ విషయాన్ని నేషనల్ క్రైం బ్యూరో చెపుతున్న నివేదిక సాక్షమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు కానీ...వైసీపీ ఆదాయం మాత్రం భారీగా పెరిగిందని ఎద్దేవా చేశారు. జగన్ మూడేళ్లలో 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించేందుకు లేపాక్షిలో భూములు కొట్టేశారు చంద్రబాబు ఆరోపించారు. 20 కోట్లు ఆదాయం లేని కంపెనీతో 500 కోట్లు పెట్టి వేల కోట్ల భూములుకొట్టేసి సొంత కంపెనీకి మైనింగ్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన పానెల్‌ను జగన్ రద్దు చేశారని హైకోర్టు చీవాట్లు పెట్టి మళ్లీ వారికే అధికారం ఇచ్చిందని తెలిపారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీ నేతలకే బాధ్యతలు

సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యాలి పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఓట్లు గల్లంతు చేస్తారని తెలిపారు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా తమ ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేమని అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే తమనే విమర్శిస్తున్న నీలిమీడియాగా ఉన్న టీడీ9, ఎన్టీవీని దూరంగా పెట్టి. వారికి బాధ్యత గుర్తు చెయ్యాలని చెప్పారు. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుని విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే ఎక్కువ నష్టం జరుగుతుందని, అందుకు నేతలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంట్లోంచి టీడీపీ నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారంటే, జగన్‌కు నిద్రలో కూడా టీడీపీ నేతలే గుర్తుకు వస్తునట్టున్నారని విమర్శించారు. పోలీసులు లేకుండా వైసీపీ వాళ్లు వస్తే ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుందని విమర్శించారు. నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఎద్దేశా చేశారు

నాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు

కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతామని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ నాపై కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు వెతుకుతున్నారని తన పేరు చెప్పమని కేసులు పెట్టి బాధితులను ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అవినీతి బుదర మనకూ అంటించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు 18 నెలల సమయం ఉందని జగన్ ముందోస్తు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మేథావులు, ఉద్యోగులుతో సహా అందరూ కలిసి రావాలి సూచించారు. నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు

నేను మారుతున్నాను.. మీరూ మారండి

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా బరిలో ఉన్నారని తెలిపారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. పార్టీపై ఎక్కువ సమయం దృష్టి పెట్టలేదు కాబట్టి సమస్యలు వచ్చాయన్నారు. పార్టీపై దృష్టిపెట్టిన సందర్భంలో మనకు ఓటమి లేదని తెలిపారు. పాలనలో తాను పడిపోయినప్పుడే సమస్యలు వచ్చాయని, తాను సైతం నన్ను సరి చేసుకుంటున్నాని చంద్రబాబు తెలిపారు. క్విట్ జగన్.... సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని సూచించారు.


Next Story

Most Viewed