తిరుమలలో వ్యాపారులకు బిగ్ షాక్.. ఆ మఠం కూల్చివేతకు రెడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-16 14:42:46  IST  )

తిరుమలలో హథీరాం బావాజీ మఠం కూల్చివేతకు అధికారులు రెడీ అవుతున్నారు..

తిరుమలలో వ్యాపారులకు బిగ్ షాక్.. ఆ మఠం కూల్చివేతకు రెడీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirupmala)లో హథీరాం బావాజీ మఠం(Hathira Bawaji Math) కూల్చివేతకు అధికారులు రెడీ అవుతున్నారు. పురాతన నిర్మాణం కావడంతో కూల్చివేయాలని నిర్ణయం తీసున్నారు. ఈ మేరకు కూల్చివేత పనులకు టెండర్లు వేశారు. రూ. 1.50 వేలకు కూల్చివేసేందుకు టెండర్ ఫైనల్ అయింది. అలాగే ఈ నిర్మాణానికి చెందిన పురాతన కలపతో పాటు పని కొచ్చే సామాగ్రీని తీసుకునేందుకు రూ. 90 లక్షల వరకూ టెండర్ ఖరారు అయింది. అయితే ఈ భవనాన్ని కూల్చివేస్తే తమ బతుకుదెరువు పోతోందని వ్యాపారులు చెబుతున్నారు. రూ. 7 అద్దె నుంచి రూ. 25 వేల వరకూ చెల్లిస్తున్నామని, ఇప్పుడు సెడన్‌గా ఈ భవనాన్ని కూల్చివేస్తామంటూ తమ ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే హథీరాం బావాజీ మఠాన్ని కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. అయితే వ్యాపారులు మాత్రం అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story