దారుణం.. మనస్పర్థలతో ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి ఆత్మహత్య

by Sathputhe Rajesh |

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

దారుణం.. మనస్పర్థలతో ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవ పడిన వ్యక్తి తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని అనంతసాగరం చెరువులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ (35) అతని ఇద్దరు కుమారులైన ఇమ్రాన్ (9), రెండవ కొడుకు సోహైల్ (6)గా పోలీసులు గుర్తించారు. మహమ్మద్ రఫీ (35) ఇంట్లో గొడవ పడి ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్లిపోయినట్లు అనంతపురం మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందింది. కాగా అనంత సాగరం చెరువులో తాజాగా మృతదేహలను గుర్తించారు.

Next Story