- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home minister Anitha: పారదర్శకంగానే అరెస్టులు
అన్ని సాక్ష్యాలు సేకరించన తర్వాతనే, పాదర్శకంగా అరెస్టులు జరుగుతున్నట్లు హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

వైసీపీ హయాంలోనే పరాకాష్టకు రాజకీయ హింస
హోమంత్రి వంగలపూడి అనిత
దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని సాక్ష్యాలు సేకరించన తర్వాతనే, పాదర్శకంగా అరెస్టులు జరుగుతున్నట్లు హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ మీరు చెప్పిన తప్పుడు పనులు చేయడం వల్ల ఐపీఎస్లు నష్టపోతున్నారని అన్నారు. నాలుగు గదుల మధ్యలో చెప్పడం కాదు.. జగన్ (YS Jagan) బయటకు వచ్చి చెప్పాలని అన్నారు. తమ నాయకులు ఎంతమందిపై కేసులు పెట్టారో అందరికీ తెలుసునని అన్నారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే దానిని జగన్ ఖండించలేదన్నారు. తాము పారదర్శకంగా చర్యలు చేపడుతున్నట్లు హోమంత్రి అనిత తెలిపారు. వృద్ధులు అని చూడకుండా మహిళలు అని చూడకుండా గతంలో అరెస్టులు చేశారని అన్నారు. జగన్చేత శభాష్ అని అనిపించుకోవడానికి కొందరు పోలీసులు పనిచేశారని అన్నారు. దళిత డ్రైవర్హత్య కేసులో లోతుగా విచారణ జరిపేందుకు కోర్టు అనుమతి కోసం వెళుతున్నట్లు పేర్కొన్నారు. జత్వాని కేసులో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. ఇందులో ఐపీఎస్(IPS officers)అధికారులు ఇన్వాల్యు అయినట్లు తేలిందన్నారు. మద్యం కుంభకోణం లో సిట్ (SIT)విచారణ జరుగుతుందన్నారు. రాజకీయ హింస వైసీపీ హయాంలో పరాకాష్టకు వెళ్లిందన్నారు. ఎక్కడైనా శవం ఉంటే జగన్రోడ్డు ఎక్కుతున్నాడని అన్నారు. అంతేకాని ప్రజల సమస్యలకోసం పోరాడడం లేదన్నారు.






