Chandrababu Issue: పార్లమెంట్‌లో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య వాగ్వాదం

by Disha Web Desk 16 |
Chandrababu Issue: పార్లమెంట్‌లో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ విషయంలో వెంటనే ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ కోరారు. అయితే ఇందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అన్ని అధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిందని చెప్పారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఐటీ శాఖ చంద్రబాబు పీఏకు నోటీసులు ఇచ్చిందని, అయితే ఆయన పరారీలో ఉన్నారని మిథున్ రెడ్డి తెలిపారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిందని మిథున్ రెడ్డి చెప్పారు.


Next Story

Most Viewed