హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్లుగా ముగ్గురి నియామకం.. అధికారిక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-16 13:46:57  IST  )

హైకోర్టులో కేసుల వాదనకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్లుగా ముగ్గురి నియామకం.. అధికారిక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్లుగా (Government Pleaders) ముగ్గురిని నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్లీడర్లుగా ఎస్‌వీ.రమణ, కె.పల్లవి, టీవీపీ సాయి విహారి నియమితులయ్యారు. అయితే, న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ వ్యాజ్యాలు, రాజ్యాంగపరమైన అంశాలు, ఇతర కేసుల్లో ప్రభుత్వం తరఫున వీరు వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు వారి నియామకాలకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

Next Story