AP Special Teachers: ఏపీలో 2,260 స్పెషల్​టీచర్ల నియామకం.. ఆమోదం తెలిపిన క్యాబినెట్​

by Thanuru Gopichand |

ఏపీలో 2,260 స్పెషల్​టీచర్ల నియామకానికి రాష్ట్ర కేబినెట్​ఆమోదం తెలిపింది.

AP Special Teachers: ఏపీలో 2,260 స్పెషల్​టీచర్ల నియామకం.. ఆమోదం తెలిపిన క్యాబినెట్​
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో 2,260 స్పెషల్​టీచర్ల నియామకానికి రాష్ట్ర కేబినెట్​ఆమోదం తెలిపింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్​సమావేశం (Cabinet Meeting) జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను సృష్టిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. అయితే రేపు జరగబోయే డీఎస్సీలో కాకుండా.. ఈ పోస్టులను ప్రత్యేకంగా తర్వాత డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని అప్పట్లో నిర్ణయించింది. ఈ రోజు జరిగిన కేబినెట్​సమావేశంలో ఈ పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదల లభించింది. అదే విధంగా ఈ రోజు జరిగిన కేబినెట్​సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయింపునకు కేబినెట్​అనుమతి లభించింది. తాడిమర్రిలో అదానీ పవర్​కు 500 మెగావాట్ల పంప్డ్​స్టోరేజి ప్రాజెక్టు కు భూమి కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్​లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. రాజధాని అమరావతిలో బార్​కౌన్సిల్​ఆఫ్​ ఇండియా ద్వారా లీగల్​వర్సిటీ ఏర్పాటునకు నిర్ణయించారు. దుకాణాల ద్వారా రేషన్​, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ఏపీ లెదర్​ఫుట్​వేర్​పాలసీ 4.0కి ఆమోదం లభించింది. ముఖ్యంగా పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్​ఓకే చెప్పింది.

పారదర్శకంగా లిక్కర్​కేసు విచారణ

ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ పాదర్శకంగా జరుగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ కేబినెట్ భేటీకి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వచ్చారు. లిక్కర్ స్కాం దర్యాప్తు వివరాలు కేబినెట్‍కు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలకు తావివ్వొద్దని సూచించారు.

Next Story