- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRAGCET 2025: ఏపీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (AP Gurukula Adimissions) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు స్వీకరణకు గడువు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి పి. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (AP Gurukula Adimissions) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తు స్వీకరణకు గడువు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి పి. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలను ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ (Social Welfare) గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైట్ https://apbragcet.apcfss.in లో పొందవచ్చునని సూచించారు.
ఏపీలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 5వ తరగతి, ఇంటర్మొదటి సంవత్సరంలో చేరడానికి తొలుత ఈ నెల ఆరో తేదీ గడువు విధించారు. కాగా దీనిని పొడిగించారు. ఆన్లైన్లో ఈదరఖాస్తును స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. పరీక్షలో మెరిట్ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా బోధన ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.






