AP: రేపు, ఎల్లుండి జాగ్రత్త..ఈ ప్రాంతాల‌కు తీవ్ర వడగాలులు!

by velandi.Saikiran |

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఎండ తీవ్రత‌రం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

AP: రేపు, ఎల్లుండి జాగ్రత్త..ఈ ప్రాంతాల‌కు తీవ్ర వడగాలులు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఎండ తీవ్రత‌రం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు 71 మండలాలలో, ఎల్లుండి 310 మండలాలలో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.

బుధ‌వారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని వివ‌రించారు.

Next Story