Apలో ఉపాధ్యాయ పోస్టులు.. ఈ నెల 26లోపే దరఖాస్తులు

by Disha Web Desk 16 |
Apలో ఉపాధ్యాయ పోస్టులు.. ఈ నెల 26లోపే దరఖాస్తులు
X

దిశ, పోలవరం: ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నట్లు ఏలూరు జిల్లా గురుకుల పాఠశాలలు, కళాశాలల కన్వీనర్ కె సుభాషిణిరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 26 సాయంత్రం 5 గంటలలోపు గురుకులం సెల్ ఐటీడీఏ కోటరామచంద్రాపురం (కె ఆర్ పురం)లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ, బీహెడ్, టెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో పాటు ఇంగ్లీష్‌లో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ఉదయం 10 గంటలకు గురుకుల పాఠశాల (బాలురు)కె ఆర్ పురంలో డెమో తరగతులు నిర్వహించడం జరుగుతుందని సుభాషిణిరాణి తెలిపారు.



Next Story

Most Viewed