ఏపీ టెట్... నేటి రాత్రితో ముగియనున్న గడువు

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) దరఖాస్తులకు ఈరోజు రాత్రి 11.59PM తో గడువు ముగియనుంది.

ఏపీ టెట్... నేటి రాత్రితో ముగియనున్న గడువు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) దరఖాస్తులకు ఈరోజు రాత్రి 11.59PM తో గడువు ముగియనుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు విడుదలవనుండగా.. డిసెంబర్ 10 నుంచి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 19న ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in/. నందు మిగతా వివరాలు చూసుకోవచ్చని పేర్కొన్నారు.

Next Story