గ్రోత్ రేట్‌లో ఏపీ నంబర్ వన్ : CM YS Jagan Mohan Reddy

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-30 07:33:17  IST  )

సోమవారం వినుకొండలో జగనన్న చేదోడు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

గ్రోత్ రేట్‌లో ఏపీ నంబర్ వన్ : CM YS Jagan Mohan Reddy
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం వినుకొండలో జగనన్న చేదోడు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. జగనన్న చేదోడు పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ.10వేల సాయం అందుతుందన్నారు. ఏపీ వ్యాప్తంగా 3.30 లక్షల మందికి రూ.330.15కోట్ల లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఈ మూడేళ్లలో రూ.927.51 కోట్ల సాయాన్ని అందజేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే ఏపీ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. గ్రోత్ రేట్‌లో ఏపీ దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుతోందన్నారు.

Read more:

మంత్రి కేటీఆర్ ప్రోగ్రాంకు వెళ్లకుండా.. విలేకరులను అడ్డుకున్న పోలీసులు

Next Story