Roja Selvamani: కర్ణాటకలో బీజేపీ ఓటమికి కారణం ఆయనే.. మంత్రి రోజా సంచలన ట్వీట్

by Disha Web Desk 16 |
Roja Selvamani: కర్ణాటకలో బీజేపీ ఓటమికి కారణం ఆయనే..  మంత్రి రోజా సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయింది. అయితే 60 స్థానాల్లో ఆధిక్యం చాటింది. ఇక కింగ్ మేకర్ అవుతారనుకున్న కుమార స్వామి 20 సీట్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఫలితాలపై ఏపీ మంత్రి రోజా స్పందించి టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్స్ వేశారు. కాంగ్రెస్‌ను చంద్రబాబు వదిలేశారని అందుకే కర్ణాటకలో ఆ పార్టీ గెలిచిందని, బీజేపీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారని అందుకే బీజేపీ ఓడిపోయిందని ఆమె విమర్శించారు. చంద్రబాబుతో కలిస్తే ఓటమి.. విడిపోతే విజయం ఇదే రాజకీయ సూత్రం అని రోజా ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన కొందరు టీడీపీ నేతలు మంత్రి రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో రోజా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ ఓటమి పాలైందని, ఈసారి ఎన్నికల్లో కూడా రోజా వల్లే వైసీపీ ఓడిపోబోతోందని విమర్శలు చేస్తున్నారు. మరి వీరి వ్యాఖ్యలకు రోజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Karnataka Results: కర్నూలు రైతుల సంబరాలు

Next Story

Most Viewed