Vijayawada: లిక్కర్ కేసు విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-06 07:27:54  IST  )

ఏపీ లిక్కర్ కేసు విచారణ వాయిదా పడింది...

Vijayawada: లిక్కర్ కేసు విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case) విచారణ వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ కోర్టు(Vijayawada Court)లో విచారణ జరిగింది. ఇరువార్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. కాగా మద్యం కేసు(Liquor Case)లో రాజ్ కసిరెడ్డితో పాటు ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో కోర్టులో వాళ్ల తరపున పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 10న కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోననే ఉత్కంఠ నిందితుల్లో నెలకొంది.

Next Story