- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ కేసులో చెవిరెడ్డి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
విజయవాడ ACB కోర్టులో ఏపీ లిక్కర్ కేసు విచారణ జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ACB కోర్టులో ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case) విచారణ జరిగింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగాలు ఉన్న చెవిరెడ్ది భాస్కర్ నాయుడు(Chevireddi Bhaskar Naidu), వైసీపీ నేత వెంకటేశ్ నాయుడు(YSRCP leader Venkatesh Naidu) బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. చెవిరెడ్డి పిటిషన్పై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇక వెంకటేష్ నాయుడు బెయిల్పై విచారణను 16కు వాయిదా వేసింది. కాగా జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిపింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్కు అప్పగించింది. ఈ కేసును విచారించిన సిట్ అధికారులు పలువురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదే కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సైతం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం తమకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరుతున్నారు.






