ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ .. నాలుగు రోజుల్లో ఫలితాలు విడుదల?

by Dishanational2 |
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ .. నాలుగు రోజుల్లో ఫలితాలు విడుదల?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడు ఇంటర్ ఫలితాలు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.కాగా, వచ్చే నాలుగో రోజుల్లో ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాల్యూయేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో,ఈ నెల 29న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వివిధ కాలేజీల యాజమాన్యాలు ఈ నెల 29న ఫలితాలు విడుదల అవుతాయని స్టూడెంట్స్, పేరెంట్స్ కు సమాచారం ఇస్తున్నాయి.

గత నెల మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ను ఏపీ ఇంటర్ బోర్డు నిర్వహించింది. ఈ పరీక్షలకు 9.20 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యాయి. ఒకేషనల్ విద్యార్థులు మరో 83,749 మంది ఉన్నారు.



Next Story