- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP: సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో నాయకుల ప్రచార పర్వం వేడెక్కింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇటీవల సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లకు వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న పలాస, రాజాం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక కోడ్ అమల్లో ఉండటంతో అలా వ్యాఖ్యలు చేయడం ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని ఈసీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆ సభలో చంద్రబాబు మాట్లాడిన ఫుటేజ్ని సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు అందజేశారు.
Read More..
Next Story