శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జస్టిస్ రవినాథ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ(TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story