Ap News: గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-23 12:46:11  IST  )

ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి...

Ap News: గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు(Group-2 Mains Exams) ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 175 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. చెదరుమదురు ఘటనలు మినహా అన్ని పరీక్షా కేంద్రాల్లో సాయంత్రం వరకూ ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి. వచ్చే నెలకు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరిన విషయం తెలిసిందే. అయినా సరే 175 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్-2 పరీక్ష యధావిథిగా జరిగింది. ప్రిలిమ్స్ ద్వారా అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల్లో 92 శాతం ఎగ్జామ్స్ రాశారు. అత్యధికంగా విశాఖలో, అత్యల్పంగా నెల్లూరులో అభ్యర్థులు పరీక్షలు రాశారు. కొంతమంది ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు రావడంతో వారిని అధికారులు, పోలీసులు వెనక్కి పంపినట్లు తెలుస్తోంది.

Next Story