ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ. 600 కోట్లు విడుదల

by Ajay Maddhiboyina |

ఏపీ ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ కోసం రూ.600 కోట్ల‌ను విడుద‌ల చేసింది. 2024-25 సంవ‌త్స‌రానికి గాను అద‌న‌పు మొత్తం విడుద‌ల చేశామ‌ని విద్యాశాఖ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసింది.

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ. 600 కోట్లు విడుదల
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ కోసం రూ.600 కోట్ల‌ను విడుద‌ల చేసింది. 2024-25 సంవ‌త్స‌రానికి గాను అద‌న‌పు మొత్తం విడుద‌ల చేశామ‌ని విద్యాశాఖ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త‌గా రూ.788 కోట్లు విడుద‌ల చేశామ‌ని, మ‌రో రూ.400 కోట్లు విడుద‌ల చేస్తామ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. ద‌శ‌ల‌వారిగా బ‌కాయిలు అన్నీ చెల్లిస్తామ‌ని తెలిపింది. ఇదిలా ఉంటే మార్చిలోనూ విద్యాశాఖ రూ.600 కోట్లు ఫీజు రియింబ‌ర్స్ మెంట్ నిధులు విడుద‌ల చేసింది. రియింబ‌ర్స్ మెంట్ రాక‌పోవ‌డంతో విద్యార్థుల‌పై కాలేజీ యాజ‌మాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ద‌శ‌ల‌వారీగా నిధుల‌ను విడుద‌ల చేస్తున్నారు.

Next Story