ఢిల్లీలో ఏపీ గవర్నర్.. పలువురు ప్రముఖులతో భేటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-25 13:26:14  IST  )

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్‌ జస్టిస్‌ ఎస్.అబ్దుల్‌ నజీర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు...

ఢిల్లీలో ఏపీ గవర్నర్.. పలువురు ప్రముఖులతో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్‌ జస్టిస్‌ ఎస్.అబ్దుల్‌ నజీర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్‌ సమావేశం అవుతున్నారు.. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్‌ నజీర్‌ సమావేశమయ్యారు. 6.15గంటలకు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో గవర్నర్‌ నజీర్‌ సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో నజీర్‌ భేటీ కానున్నారు.

Next Story