లిక్కర్ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో..!

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-21 07:05:09  IST  )

మద్యం కేసు(AP Liquor Case0పై ఏపీ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

లిక్కర్ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో..!
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం కేసు(AP Liquor Case)పై ఏపీ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు కేసిరెడ్డి(Raj Kesireddy) ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కేసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేసిరెడ్డి ఏ1గా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

Next Story